Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

మహేష్ బాబు సినిమాకి దర్శకుడు పరశురామ్ పారితోషికం ఎంతో తెలుసా

మహేష్ బాబు సినిమాకి దర్శకుడు పరశురామ్ పారితోషికం ఎంతో తెలుసా
సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజాగా దర్శకుడు పరుశురామ్ తో కలిసి సర్కార్ వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదలయ్యింది. గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత దాదాపు రెండేళ్ళకు పైగా ఖాళీగా ఉన్న పరుశురామ్ ఇప్పుడు మహేశ్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు సిద్దమవుతున్నాడు.
అయితే మహేశ్ సినిమా కోసం పరశురామ్ ఏకంగా 8 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుంది. అంతేకాదు సినిమాకు వచ్చే లాభాల్లో 20% షేర్ కూడా తీసుకుంటున్నాడని, ఇందులో భాగంగానే ముందుగానే నిర్మాతల నుంచి 4 కోట్లు అడ్వాన్స్ అందుకోబోతున్నాడని, సినిమా విడుదలైన తర్వాత మిగిలిన పారితోషికంతో పాటు లాభాలు కూడా ఇవ్వాలని అగ్రిమెంట్ చేసుకోబోతున్నట్టు తెలుస్తుంది. అయితే గీత గోవిందం సినిమాలా మహేశ్ సినిమాకు కూడా భారీగా లాభాలు వస్తే కనుక దర్శకుడు పరుశురామ్ ఫీట్ పూర్తిగా మారిపోవడం ఖాయం.

Post a Comment

0 Comments